Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కూ ఓపెన్

ఏపీలో ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కూ ఓపెన్
X

అన్ లాక్ ప్ర‌క్రియ‌లో మ‌రో అడుగు. ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు మరింత పెరిగాయి. ప్ర‌స్తుతం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌ వ‌ర‌కే స‌డ‌లింపులు ఉన్నాయి. వీటిని ప్ర‌స్తుతం ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కూ పెంచారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర జ‌రిగిన స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్‌ 21 నుంచి 30 వరకు సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది.

సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇస్తుండగా.. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని తెలిపారు. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేశారు.

Next Story
Share it