Telugu Gateway
Andhra Pradesh

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గురువారం ఆయన గుంటూరులోని భారత్ పేటలో ఉన్న 140వ వార్డు సచివాలయంలో తన పేరు నమోదు చేయించుకుని అక్కడే వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని తాజాగా సీఎం జగన్ ప్రకటించారు.

గురువారం నుంచి గ్రామ సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషన్ కు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Next Story
Share it