Telugu Gateway
Andhra Pradesh

సోనియా ని ఎదిరించిన జగన్ ...అమిత్ షా కు కౌంటర్ ఇవ్వలేరా?!

సోనియా ని ఎదిరించిన జగన్ ...అమిత్ షా కు కౌంటర్ ఇవ్వలేరా?!
X

నిన్న అమిత్ షా. మొన్న బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జె పీ నడ్డా . గతంలో ఎన్నడూలేని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు పై ఘాటు విమర్శలు చేశారు. జె పీ నడ్డా విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. అయితే ఆదివారం నాడు విశాఖపట్నం కేంద్రంగా బీజేపీ కీలకనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై సీఎం జగన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడక పోవటం ఇప్పుడు కీలకంగా మారింది. అమిత్ షా అయితే ఏకంగా రైతుల ఆత్మ హత్యల విషయంలో సీఎం జగన్ సిగ్గుపడాలి అని విమర్శించారు. అంతే కాదు వైజాగ్ అరాచక శక్తులకు అడ్డాగా మారింది అని ..గత నాలుగు ఏళ్లలో ఆంధ్ర ప్రదేశ్ అంతా అవినీతిమయం చేశారు అంటూ మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ క్యాడర్ దోచుకుంటున్నారు అని విమర్శించారు. ఇంత ఘాటు విమర్శలు చేసినా...జగన్ పాలనలో అంతా అవినీతి అంటూ అటు అమిత్ షా, ఇటు నడ్డా మాట్లాడినా జగన్ మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. సహజంగా అయితే జగన్ వీటిపై ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు. కానీ అయన సోమవారం నాడు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో మాట్లాడారు. ఇలాంటి మీటింగ్స్ లోనే పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు గత కొంత కాలంగా. కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీడియా పై ఎటాక్ చేశారు తప్ప అటు నడ్డా, ఇటు అమిత్ షా చేసిన ఘాటు విమర్శలకు కౌంటర్ కాదు కదా అసలు వాళ్ళ పేరు ఎత్తకుండా బీజేపీ మనకు అండగా ఉండకపోవొచ్చు అంటూ మాట్లాడారు.

ఇది ఒక్కటే సీఎం జగన్ చేసిన కామెంట్. అయితే తాను వాళ్ళు ఎవరినీ నమ్ము కోలేదు అని స్పందించారు. ఎప్పటిలాగానే చంద్రబాబు పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. టీడీపీ కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టో టార్గెట్ గా అయన విమర్శలు సాగాయి. చంద్రబాబు ఎన్నికల ముందు వాగ్దానం చేస్తారు ...ఎన్నికల తర్వాత మోసం చేస్తారు. . రైతులు. బీసీలు, ఎస్ సి లకు ఏమి చేశాడు అంటే మోసం తప్ప మరొకటి లేదు. చంద్రబాబు నాయుడు పేరు చెపితే ఒక్క పథకం కూడా గుర్తు రాదు. మూసేయటానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్క రాష్ట్రాల మేనిఫెస్టో లు తెచ్చి కిచిడి చేసి...పులిహోరగా మారుస్తున్నారు. పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఏమి చేయలేదు కానీ ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్, బీసీ, ఎస్సి, మైనారిటీ డిక్లరేషన్ అంటూ మొదలెట్టాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా అని అడుగుతున్నా. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తాను నమ్ముకున్నది ప్రజలను. అంతే కానీ ఎవరినీ కాదు అంటూ జగన్ రియాక్ట్ అయ్యారు.

Next Story
Share it