గవర్నర్ తో సీఎం జగన్ భేటీ
BY Admin4 Aug 2021 3:12 PM GMT
X
Admin4 Aug 2021 3:12 PM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. కుటుంబ సమేతంగా జగన్ గవర్నర్ తో సమావేశం అయ్యారు. ఇది పూర్తిగా మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టినరోజు జరుపుకున్నారు. కోవిడ్ కారణంగా ఆయన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. దీంతో మరుసటి రోజు జగన్ ఆయనతో సమావేశం అయి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story