ఏపీ అసెంబ్లీలో గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ నినాదాలు
BY Admin7 March 2022 5:54 AM GMT
X
Admin7 March 2022 5:54 AM GMT
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన ప్రసంగం సాగుతున్నంత సేపూ టీడీపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో గవర్నర్ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చింపిచేశారు. గవర్నర్ తన ప్రసంగంలో పరిపాలనా వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారు.కొత్త జిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ అహసనం వ్యక్తం చేశారు.
Next Story