Telugu Gateway
Andhra Pradesh

లక్షకు చేరువలో ఏపీ కరోనా యాక్టివ్ కేసులు

లక్షకు చేరువలో ఏపీ కరోనా యాక్టివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 11,434 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం 99446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 64 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2028 కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 1982 కేసులు, శ్రీకాకుళంలో 1322, నెల్లూరులో 1237, విశాఖపట్నంలో 1067 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 13716 కేసులు ఉండగా, శ్రీకాకుళంలో 12883, నెల్లూరులో 10,024 కేసులు ఉన్నాయి.

Next Story
Share it