Telugu Gateway
Andhra Pradesh

అవసరం అయితే జగన్ ను కలుస్తా

అవసరం అయితే జగన్ ను కలుస్తా
X

తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ గత మూడు రోజులుగా హిందుపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పలు కార్యక్రమాల్ల పాల్గొంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. హిందుపురాన్ని జిల్లాగా ప్రకటించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంపై అవసరం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని అన్నారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని విమర్శించారు. ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

Next Story
Share it