Telugu Gateway
Andhra Pradesh

అంబటి రాంబాబుకు రెండవ సారి కరోనా

అంబటి రాంబాబుకు రెండవ సారి కరోనా
X

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మొదట వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'జులైలో నాకు కోవిడ్ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే.

నిన్న అసెంబ్లీలో కోవిడ్ టెస్ట్ చేయించాను, రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిడ్ ని మరోసారి జయించి మీ ముందుకి వస్తాను' అని ప్రకటించారు. కొంత మందికి రెండవ సారి కరోనా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అంబటి రాంబాబు రెండవ సారి కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది.

Next Story
Share it