Telugu Gateway
Andhra Pradesh

ఏది ఎవరికో ముందే ఫిక్స్!

ఏది ఎవరికో ముందే ఫిక్స్!
X

పేరుకే టెండర్లు. అన్ని పంచి పెట్టడమే. ఎవరికి ఏ పని ఇవ్వాలి అన్నది ముందే డిసైడ్ అయిపోతుంది అని . ఆ తర్వాతే నామ్ కే వాస్తే టెండర్లు కూడా ఉంటాయి అని అధికార వర్గాలు చెపుతున్నాయి. లేకపోతే అదేదో అందరూ కూడబలుక్కుని వేసినట్లు ఒక్కరు కూడా లెస్ కు వేయకుండా అందరూ ఎక్సెస్ కే ఎలా టెండర్లు వేస్తారు. అదే సమయంలో ఒక్కో కంపెనీ కి తక్కువలో తక్కువ నాలుగు నుంచి ఐదు పనులు దక్కుతాయి కూడా మళ్ళీ. వీటి విలువ కూడా వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. రాజధాని లో ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల పనులు పంచిన తరహాలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్ల పనుల పంపకం కూడా ఇప్పటికే పూర్తి అయింది అమరావతి టెండర్ల వ్యవహారాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు. జీఏడీ టవర్ ను దేశంలోని ఎంతో పేరున్న ఒక నిర్మాణ సంస్థకు కట్టబెట్టాలని...టవర్ 2 , 3 పనులను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఒక లిస్టెడ్ కంపెనీ కి ఇవ్వటానికి అంతా సిద్ధం అయినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

టవర్ 1 , 2 పనులకు ఇప్పటికే అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న బెంగళూరు కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థకు కేటాయించటానికి అంతా సిద్ధం చేశారు అని చెపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఏపీసిఆర్డీఏ ఈ ఐదు టవర్ ల నిర్మాణాన్ని టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయం 1126 కోట్ల రూపాయలుగా ఉంది. సచివాలయంలో భాగంగా నిర్మించే టవర్ 1 , 2 ల నిర్మాణ వ్యయం 1897.86 కోట్లు, టవర్ 3 , 4 ల నిర్మాణ వ్యయం 1664 కోట్ల రూపాయలుగా ఉంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించనున్న ఈ ఐదు టవర్లు కలుపుకుంటే మొత్తం నిర్మాణ వ్యయం 4668 .82 కోట్ల రూపాయలు కానుంది. మే 1 న నూతన సచివాలయం టవర్ల నిర్మాణానికి సంబదించిన టెక్నీకల్ బిడ్స్ ఓపెన్ చేస్తారు. ఆ వెంటనే ఫైనాన్సియల్ బిడ్స్ ఓపెన్ చేసి ఎల్ 1 గా వచ్చిన కంపెనీకి పనులు అప్పగిస్తారు.

Next Story
Share it