అద్దెకు విజయవాడ విమానాశ్రయం..ఏభై ఏళ్ళు

దీనికి సంబదించిన పనులు సాగుతున్నాయని,,,త్వరలోనే దీనిపై టెండర్ల జారీ ప్రకటన వింటారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇలా లీజ్ కు ఇచ్చిన విమానాశ్రయాల ద్వారా వచ్చిన మొత్తాలను ద్వితీయ, తృతియ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉపయోగిస్తామన్నారు. ఈ విమానాశ్రయాలను లీజ్ కు ఇవ్వటం ద్వారా అప్ ఫ్రంట్ కింద 8000 కోట్ల రూపాయలు వస్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద ఆస్తుల నగదీకరణ కింద 20000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 లో కేంద్రం ఆరు విమానాశ్రయాలను లీజ్ కు ఇవ్వగా అన్ని అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో లక్నో, అహ్మదాబాద్, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురం ఉన్నాయి.