ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో షాక్. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పంపుతున్నట్లు తెలిపారు. గతంలో ఆమె తెలుగు మహిళ అద్యక్ష్యురాలుగా కూడా పనిచేశారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు భరించలేకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.