వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు

Update: 2021-02-15 14:52 GMT

అధికార వైసీపీ నేతలను టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడేవారు తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని..బెదిరింపులకు దిగటం సరికాదన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతామన్నారు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ మద్దతుదారు నాగరాజు భార్య సుజాతను బాలకృష్ణ సోమవారం నాడు పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల బెదిరింపులకు బెదిరేది లేదన్నారు. వైసీపీ దాడులను టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా ధైర్యంగా తిప్పికొట్టాలన్నారు. నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఆయన సోమవారం నాడు హిందుపురం నియోజకవర్గంలో పర్యటించారు. గత కొంత కాలంగా బాలకృష్ణ నేతలతో నేరుగా మాట్లాడుతూ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News