రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ దాడి సరికాదు

Update: 2021-01-25 05:02 GMT

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును సీనియిర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. ' ఈ మధ్య మీరు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న దాడి మీడియా ద్వారా చూస్తున్నాను. దానికి నా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎన్నికలు అన్నవి రాష్ట్రంలో పరిస్థితిని బట్టి నిర్వహించటానికి ప్రయత్నం చేయాలి కానీ రాజకీయ నాయకుల్లాగా పట్టుదలకు పోవటం మంచిగా లేదు. ఎవరో అదృశ్యశక్తి వెనకుండి ఈ తలనొప్పులు సృష్టిస్తున్నారని నాలాంటివాడి అనుమానం.

మీరు ఉద్యోగస్తులు. చాలా పెద్ద చదువుకుని, పెద్ద హోదాలో ఉన్నారు. ఉద్యోగంలో ఉంటూ రాజకీయాలు చేయటం మంచిగా లేదు. మీ తగాదాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మీరు పట్టుదలతో తగవులు పడుతూ న్యాయస్థానాల్లో వాదించటానికి న్యాయవాదులను నియమించటానికి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. ఇది ప్రజల కష్టార్జితంతో వచ్చిన డబ్బు అన్న సంగతి మరవొద్దు. బాధ్యత గల పౌరుడిగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను' అని పేర్కొన్నారు.

Tags:    

Similar News