సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు హుజూరాబాద్ రిహార్స‌ల్

Update: 2021-06-17 14:34 GMT

బిజెపిలో చేరిన అనంత‌రం తొలిసారి నియోజ‌క‌వర్గంలో అడుగుపెట్టిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ర్యాలీ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ రిహార్స‌ల్ వంటిద‌ని వ్యాఖ్యానించారు. త‌న అనుచ‌రుల‌ను వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని..ఇది కొనసాగితే స‌హించేదిలేద‌ని హెచ్చ‌రించారు.ప్ర‌జ‌లు ప్రేమ‌కు లొంగుతారు కానీ..బెదిరింపుల‌కు కాద‌న్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికతో .. టీఆర్ఎస్ అహంకారానికి ఘోరీ కడతారని వ్యాఖ్యానించారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మ గౌరవం పోరాటానికి హుజురాబాద్ వేదిక అని రేపటి నుంచి ఇంటింటికి వెళ్తానని ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

Tags:    

Similar News