పశ్చిమ బెంగాల్ సీఎస్, డీజీపీలకు సమన్లు

Update: 2020-12-11 08:26 GMT

బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా పై పశ్చిమ బెంగాల్ లో జరిగిన దాడిని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. నడ్డా వాహనశ్రేణిపై కొంత మంది టీఎంసీ కార్యకర్తలు పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన దాడి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. వడ్డితో సహా చెల్లిస్తామని బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ హెచ్చరించారు. 'మేం మారుస్తాం.. మేం ప్రతీకారం తీర్చుకుంటాం.

వడ్డీతో సహా చెల్లిస్తాం' అంటూ దిలీప్‌ ఘోష్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే నడ్డా కాన్వాయ్‌పై దాడి అంశంలో కేంద్ర హోం శాఖ బెంగాల్‌ సీఎస్‌, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్‌ షా గవర్నర్‌ని కోరిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News