వామన్ రావు దంపతులవి సర్కారు హత్యలే

Update: 2021-02-18 07:29 GMT

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామనరావు దంపతులవి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. బండి సంజయ్ గురువారం నాడు మాజీ ఎంపీ వివేక్ తదితరులతో కలసి వామన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ దారుణ ఘటనపై టీఆర్ఎస్ నేతలు కనీసం ఖండన కూడా చేయకపోవటం దారుణమన్నారు. ఎందుకు టీఆర్ఎస్ నేతలు స్పందించటం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ స్పందించకపోతే జంట హత్యలో అయన పాత్ర ఉన్నట్లే భావించాల్సి ఉంటుందని అన్నారు.

విచారణ పూర్తి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కానీ అలాంటి వారిని ఎన్ కౌంటర్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. విచారణ తర్వాత ఈ హత్య వెనక ఎవరు ఉన్నా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాము స్వాగతిస్తామన్నారు. హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, ఆయన భార్య నాగమణిలను పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం నాడు రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News