దుబ్బాకలో బిజెపి లీడ్

Update: 2020-11-10 04:12 GMT

బిజెపి అన్నంత పని చేస్తుందా?. అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతుందా?. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి వెల్లడైన రెండు రౌండ్లలోనూ బిజెపి ఆదిపత్యం చూపించింది. మొదటి రౌండ్ నుంచి బిజెపి లీడ్ లో కొనసాగుతోంది.. అయితే ఇది అది తక్కువ ఓట్లతో కావటం విశేషం. మొత్తం 23రౌండ్స్ లో పలితం తేలనుంది. అయితే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ తక్కువ మెజారిటీతో బయటపడుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడగా..మరికొంత మంది బిజెపి 5 నుంచి 6 వేల ఓట్ల మెజారిటీతో సీటు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపారు. చూస్తుంటే ఇదే జరుగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు 620 ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు.

Tags:    

Similar News