బిజెపి బందిపోట్లతో కలసిపోయిన పవన్ కళ్యాణ్

Update: 2021-03-02 13:51 GMT

సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలు నల్లడబ్బు దొరికిన వారిని కాపాడేందుకు 30 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారనే వార్తలపై ఆయన మండిపడ్డారు. ఇలా మోసాలు చేసే బిజెపి బందిపోట్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలసి పోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేనకు ఒక్క ఓటు వేసినా వృథాయేనని నారాయణ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వివిధ వర్గాలకు చెందిన వారితో బీజేపీ నాయకులు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని నారాయణ ఆరోపించారు.

మురళీధర్‌రావు 3 కోట్లు ఇస్తానని మహిళను మోసం చేశారని ఆయన విమర్శించారు. విష్ణువర్ధన్‌రెడ్డి 30 కోట్ల రూపాయల మేర బ్లాక్ మెయిల్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పైనా ఆయన విరుచుకుపడ్డారు. కమీషన్ల కోసమే రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ వాహనాలు కొన్నారని ఆయన ఆరోపించారు. 196, 197 జీవోలు బొత్స సత్యనారాయణ ఇవ్వలేదని దుర్గగుడిలో ప్రమాణం చేయాలని బొత్సకు నారాయణ సవాల్ విసిరారు.

Tags:    

Similar News