చంద్రబాబు ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన

Update: 2021-02-26 14:30 GMT

రంగంలోకి దింపాలని కోరిన కార్యకర్తలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపండి సర్ అంటూ కార్యకర్తలు చంద్రబాబును కోరారు. జూనియర్ ఎన్టీఆర్ తప్పుకుండా రావాలి సర్ అంటూ కేకలు వేశారు. అయితే కార్యకర్తల డిమాండ్ పై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తలూపి వదిలేశారు. రామకుప్పం బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో ఎప్పుడైనా నిలిచి గెలిచావా సజ్జల అని నిలదీశారు. తనను విమర్శించే ముందు నీ అర్హత ఏంటో తెలుసుకో..? అంటూ వ్యాఖ్యానించారు. కరెక్టుగానే మాట్లాడుతున్నా.. మాటతూలి ఎక్కడా మాట్లాడడం లేదన్నారు, ప్రజా బలం తనకుందన్నారు. తాను బసచేసిన గెస్ట్‌ హౌస్‌లో విద్యుత్ సరఫరా ఎందుకు ఆపారు..? అని ప్రశ్నించారు. జనరేటర్ పనిచేయకుండా చేశారని, జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తనను అవమానించేలా ప్రవర్తించారని చంద్రబాబు విమర్శించారు.

Tags:    

Similar News