ఏపీలో బిజెపి గెలిస్తే బీసీకే సీఎం పదవి

Update: 2021-02-04 08:13 GMT

వైసీపీ, టీడీపీ ఆ మేరకు ప్రకటన చేయగలవా?

సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీలు అంతా తమతోనే ఉన్నారన్నారు. అంతే కాదు తాము అధికారంలోకి వస్తే బీసీకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఈ పని వైసీపీ,టీడీపీ చేయగలవా అని ప్రశ్నించారు. చేతనైతే బీసీలను సీఎం చేస్తామని వైసీపీ, టీడీపీలు ప్రకటించాలన్నారు. బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బిజెపికే ఉందన్నారు. తాము ఎవరికో పదవి ఇవ్వటానికి పోరాటం చేయటంలేదని,,రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయటమే బిజపి లక్ష్యం అన్నారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తిని చూపిస్తున్నారని వెల్లడించారు. వైసీపీ, టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. భద్రాచలం తెలంగాణకు వెళ్లడం వల్ల రాయలసీమకు 200 టీఎంసీల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. సోము వీర్రాజు ప్రకటన ఖచ్చితంగా జనసేన, బిజెపిల పొత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Tags:    

Similar News