తెలంగాణ సర్కారు రాక్షసంగా ప్రవర్తిస్తోంది

Update: 2020-08-22 08:33 GMT

టీఆర్ఎస్ సర్కారు తీరును టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. ప్రజాప్రతినిధులుగా శ్రీశైలం సంఘటనను పరిశీలించడం, బాధితులను పరామర్శించడం కనీస బాధ్యత అని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు.

ప్రభుత్వ తప్పిదాలు బయట పడతాయని పోలీసులను ప్రభుత్వం ఉపయోగించి నిర్బంధానికి పాల్పడుతోందన్నారు. రేవంత్, మల్లు రవిలను వెంటనే విడుదల చేసి శ్రీశైలం సంఘటన స్థలాన్ని సందర్శించే అనుమతి ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Similar News