తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై మండిపడ్డారు. రైతులతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. రైతుల అరెస్ట్ ను ఖండించారు. తమ సంవత్సర కౌలు ఇవ్వనందుకు సిఆర్డిఎకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న అమరావతి రైతులను లాగి, నిర్దాక్షిణ్యంగా, వ్యాన్లలోకి విసిరేయటం ఏ మాత్రం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో ద్వారా స్పందించారు. రైతుల గళాలను నొక్కివేయాలని మీరు అవలంబించే ఈ నిరంకుశ పద్ధతి చూడటానికే చాల బాధ కలిగించేలా ఉందని అన్నారు.