ఢిల్లీలో కరోనా రాజకీయ నేతలను కూడా వణికిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా లక్షణాలతో మంగళవారం నాడు పరీక్షలు చేయించుకున్నారు. ఫలితం బుధవారం రానుంది. ఇప్పుడు తాజాగా బిజెపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సిందియాతోపాటు ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం వాళ్లిద్దరికి దక్షిణ ఢిల్లీలోని సాకేత్లో గల మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాలో కూడా కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనను గుర్గ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స అనంతరం ఆయన సోమవారం ఆయనను డిశ్చార్జ్ చేశారు.