ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు

Update: 2020-04-10 12:23 GMT

జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనలు మారుస్తూ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు.

ఎస్ఈసీ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదం లభించటంతో సర్కారు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం రమేష్ కుమార్ ను తప్పిస్తూ సర్కారు జీవో జారీ చేసింది.

 

Similar News