కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం

Update: 2020-03-25 15:52 GMT

కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు. దీంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి మరో 16 కోట్ల రూపాయలను కూడా కరోనా నియంత్రణ చర్యల కోసం ఉపయోగిస్తారు.

ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. మందులు, ఇతర పరికరాల కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లు లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో ఎంపీలందరం కృషి చేస్తామన్నారు.

Similar News