అజిత్ పవార్ పై ఎన్సీపీ వేటు

Update: 2019-11-23 07:41 GMT

మహారాష్ట్రలో రాజకీయాలు ట్విస్ట్ ల మీద ట్వీస్ట్ లు ఇస్తూనే ఉన్నాయి. వీటికి ఇంకా ముగింపు పడినట్లు లేదు. పార్టీ నిర్ణయానికి భిన్నంగా బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి..ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన అజిత్ పవార్ పై ఎన్సీపీ వేటు వేసింది. అంతే కాదు..పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు ఎన్సీపీ పార్టీ ఆఫీసులో హైడ్రామా నెలకొంది. అజిత్‌కు వ్యతిరేకంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. శరద్‌కు అజిత్‌ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అజిత్ పవార్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.

 

Similar News