చిదంబరానికి మద్దతుగా నిలిచిన ప్రియాంక

Update: 2019-08-21 06:54 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదరంబానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అండగా నిలబడ్డారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా బెదరం. న్యాయం కోసం పోరాడతాం. తాము చిదంబరానికి అండగా నిలబడతామని ట్విట్టర్ లో స్పష్టం చేశారు. రాజకీయ కక్ష్యసారింపు చర్యలో​ భాగంగా చిదంబరాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

‘రాజకీయ విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి చిదంబరం. కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలపై ఆయన గట్టిగా మాట్లాడినందుకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికేంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్యఇది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Similar News