Telugu Gateway
Latest News

దేశంలో 8.22 కోట్ల కరోనా పరీక్షలు

దేశంలో 8.22 కోట్ల కరోనా పరీక్షలు
X

కరోనా కేసుల్లో ఊగిసలాట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రోజు తగ్గుతున్నాయి. మరో రోజు పెరుగుతున్నాయి. తగ్గుముఖంలో మాత్రం స్థిరత్వం కనపడటం లేదు. అయితే గతంతో పోలిస్తే కరోనా కేసుల విషయంలో మాత్రం పలు ప్రాంతాల్లో కేసుల క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 72,049 పాజిటివ్ కేసులు, 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 67,57,132 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా యాక్టివ్‌ కేసులు 9,07,883. డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 57,44,693. ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి మొత్తం 1,04,555 మంది మృతి చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 85.02 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 13.44. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,22,71,654 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story
Share it