Telugu Gateway
Latest News

పోలీసు కమిషనర్..ఛానళ్ళపై కేసులు వేస్తాం

పోలీసు కమిషనర్..ఛానళ్ళపై కేసులు వేస్తాం
X

బార్క్ తన ఫిర్యాదులో ఎక్కడా కూడా రిపబ్లిక్ టీవీ పేరు ప్రస్తావించలేదని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి వెల్లడించారు. తమ ఛానల్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తోపాటు నిరాధార అంశాలతో వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లను కూడా కోర్టుకు లాగుతానని ప్రకటించారు. బార్క్ రిపబ్లిక్ టీవీ పేరు ప్రస్తావించలేదని అర్ణబ్ చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తాము పోలీసు కమిషనర్ ను ప్రశ్నించినందునే తమను టార్గెట్ చేశారని అర్ణబ్ ఆరోపించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రేతోపాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముంబయ్ పోలీసు కమిషనర్ లు రిపబ్లిక్ టీవీ ని టార్గెట్ చేశారని ఆరోపించారు. తమను ఎంత టార్గెట్ చేసినా సరే నిజాలు చెప్పటం తాము ఆపబోమని..తాము తమ వార్తలను కొనసాగిస్తామని తెలిపారు. ముంబయ్ పోలీసులపై తాము పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రిపబ్లిక్ టీవీ పలు కేసుల్లో మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే ఇలా చేస్తున్నారని అర్ణబ్ విమర్శించారు. అయితే జాతీయ ఛానళ్లు అన్నీ కూడా ఈ టీఆర్పీ స్కామ్ వార్తకు పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తున్నాయి. ఇది జాతీయ ఛానళ్ళ పోరుగా మారినట్లు కన్పిస్తోంది.

Next Story
Share it