Telugu Gateway
Latest News

మార్కెట్లోకి ఎంఎండ్ ఎం ‘థార్’ ఎస్ యూవీ

మార్కెట్లోకి ఎంఎండ్ ఎం ‘థార్’ ఎస్ యూవీ
X

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్త వాహనం థార్ మార్కెట్లో వచ్చింది. కంపెనీ శుక్రవారం ఈ వాహనాన్ని విడుదల చేసింది. స్పోర్ట్స్ యుటిలిటి వాహనం (ఎస్ యూవీ) అయిన థార్ ప్రారంభ ధర 9.8 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఎక్స్ షోరూం గరిష్ట ధర 13.75 లక్షల రూపాయలుగా ఉంది. శుక్రవారం నుంచే బుకింగ్ లు ప్రారంభించామని, వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ వాహనంతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తామని భావిస్తున్నట్లు మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా తెలిపారు.

థార్ వాహనాలను కంపెనీకి చెందిన నాసిక్ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్నారు. థార్ పెట్రోల్ ఏఎక్స్ వేరియంట్ ధరలు 9.8 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అయి గరిష్టంగా 11.9 లక్షల రూపాయలుగా ఉన్నాయి. డీజిల్ ఏఎక్స్ వేరియంట్ల ధర 9.8 లక్షల నుంచి 12.2 లక్షల రూపాయల వరకూ ఉంది. రెండు వెర్షన్లలోనూ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వెర్షన్లు ఉన్నాయి.

Next Story
Share it