Telugu Gateway
Latest News

ఎన్ టివి హెడ్ క్వార్టర్స్ పై అర్ధరాత్రి దాడి

ఎన్ టివి హెడ్ క్వార్టర్స్ పై అర్ధరాత్రి దాడి
X

సంచలనం. ఎన్టీవీ ప్రధాన కార్యాలయంపై శుక్ర్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయానికి సంబంధించిన అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రధాన ద్వారం వద్ద ధ్వంసం చేయటంతోపాటు కార్యాలయం అద్దాలు కూడా పగలగొట్టారు. ఈ దాడి ఎవరు చేశారు..ఎందుకు చేశారు అన్న కారణాలు తెలియాల్సి ఉంది.

అయితే విచిత్రం ఏమిటంటే ఎన్టీవీ యాజమాన్యం మాత్రం తమ కార్యాలయంపై జరిగిన దాడి వార్తను మాత్రం ఎక్కడా ప్రసారం చేసినట్లు కన్పించ లేదు. అయితే ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Next Story
Share it