Telugu Gateway
Latest News

దేశ జనాభా 130 కోట్లు..పన్నులు కట్టేది 1.5 కోట్ల మందే

దేశ జనాభా 130 కోట్లు..పన్నులు కట్టేది 1.5 కోట్ల మందే
X

పన్ను చెల్లించగలిగే స్థితిలో ఉన్న వారంతా ముందుకొచ్చి పన్ను చెల్లించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దేశ జనాబా 130 కోట్లలో కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు. చాలా మంది పన్ను చెల్లించగలిగే స్థితిలో ఉన్నాఇంకా ఈ పరిధిలోకి రావటం లేదన్నారు. తమంతట తాము పన్ను చెల్లించటానికి అర్హులు ముందుకు రావాలని..వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ గురువారం నాడు ‘పారదర్శక పన్నుల విధాన వేదిక’ను ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. సెప్టెంబర్‌ 25 నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ సేవలను ప్రారంభించనున్నట్లు మోదీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు. ద సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గత ఏడాది కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని వివరించింది. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోదీ తెలిపారు.

Next Story
Share it