భూమి పూజలో నదుల నీళ్ళు..వెండి ఇటుక
BY Telugu Gateway5 Aug 2020 10:20 AM GMT

X
Telugu Gateway5 Aug 2020 10:20 AM GMT
దేశంలోని రెండు వేల ప్రాముఖ్యత గల ప్రాంతాల నుంచి మట్టి. వంద నదుల నుంచి నీళ్లు. అయోధ్యలోని రామమందిరం భూమి పూజ కోసం తీసుకొచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 135 మంది సాధువులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రామమందిరం భూమి పూజకు ప్రధాని నరేంద్రమోడీ వెండి ఇటుకతో కార్యక్రమం నిర్వహించారు. భూమి పూజను పురస్కరించుకుని అయోధ్యను అత్యంత సుందరంగా ముస్తాయి చేశారు.
Next Story