Telugu Gateway
Latest News

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై
X

భారత క్రికెట్ లో ధోనీ ఇక చరిత్రే. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ క్రికెట్ దిగ్గజం తాజాగా వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఫైనల్ గా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు అయింది. ఓ వైపు ఐపీఎల్ కు రెడీ అవుతూ.. శనివారం సాయంత్రం ఈ కీలక ప్రకటన చేశాడు ధోనీ. సోషల్ మీడియా ద్వారా ఈ క్రికెటర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెలువరించాడు. తనకు ఇన్ని రోజులు మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

ధోని కెప్టెన్సీలో భారత్ ఓ ప్రపంచ కప్ తోపాటు టీ 20 వరల్డ్ కప్ ను కూడా అందుకుంది. 2004 డిసెంబర్ 23న తొలి వన్డే మ్యాచ్ తో భారత క్రికెట్ లోకి అడుగుపెట్టాడు ధోనీ. క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో జులపాల జుట్టుతో మొత్తం టీమ్ లోనే ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. తర్వాత తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకోవటమే కాకుండా..భారత్ క్రికెట్ కు ఎన్నో విజయాలు అందించటంలో కీలక పాత్ర పోషించాడు ధోనీ. తన కెరీర్ లో 350 వన్డేలు ఆడాడు.

Next Story
Share it