Telugu Gateway
Latest News

రామజన్మభూమిని సందర్శించిన తొలి ప్రధాని

రామజన్మభూమిని సందర్శించిన తొలి ప్రధాని
X

ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ఓ కొత్త రికార్డును సాధించారు. అయోధ్యలో రామ జన్మభూమిని సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు. అత్యంత వైభవంగా జరిగిన రామమందిర భూమి పూజకు మోడీ ముఖ్యఅతిధిగా హాజరైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదదేశ్ లోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమిని ఇఫ్పటివరకూ ఏ ప్రధాని సందర్శించలేదు. రామజన్మభూమి స్థలంలో ఉన్న రామ్ లల్లా వద్ద పూజలు చేసిన తర్వాత ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజకు ముందు హనుమాన్ గర్హి లో కూడా ప్రార్ధనలు నిర్వహించారు.

Next Story
Share it