Telugu Gateway
Latest News

‘థార్’ ఎస్ యూవీని ఆవిష్కరించిన ఎంఅండ్ఎం

‘థార్’ ఎస్ యూవీని ఆవిష్కరించిన ఎంఅండ్ఎం
X

అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతోపాటు..మెరుగైన పనితీరు..అత్యంత సురక్షితం, ప్రయాణికుల సౌలభ్యమే లక్ష్యాలుగా మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్ర దినోత్సవం రోజు ‘థార్’ ఎస్ యూవీని తీసుకొచ్చింది. నూతన థార్ వాహనం విడుదల ద్వారా చరిత్ర సృష్టించినట్లు ఎంఅండ్ ఎం లిమిటెడ్ ఎండీ, సీఈవో డాక్టర్ పవన్ గోయంకా తెలిపారు. సుదీర్ఘ పరీక్షల అనంతరం ఐకానిక్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో ఈ వాహనాలను పరిచయం చేసింది. ఫ్రీడమ్ డ్రైవ్‌లో భాగంగా ఈ వాహనాన్ని తీసుకొస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.బీఎస్ -6 నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోఉండనుందని తెలిపింది. కొత్త థార్ 2020 అక్టోబర్ 2న లాంచ్ చేయనుంది.

ధర, ప్రీ బుకింగ్ వివరాలు కూడా అక్టోబర్ 2 న ప్రకటిస్తామని ఎంఅండ్ఎం వెల్లడించింది. సెకండ్ జనరేషన్ థార్ వాహనంలో ప్రతీ కొత్తదిగానే ఉంటుందని ఎం అండ్ ఎం ప్రకటించింది. శక్తివంతమైన ఇంజన్, టచ్‌స్క్రీన్ సామర్థ్యాలతో కొత్త 18 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌ను, ఫార్వర్డ్ ఫేసింగ్ సీట్లు, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 650 మిమీ వాటర్ వాడింగ్ సామర్ధ్యంలాంటి ఫీచర్లను అమర్చింది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ అసిస్ట్, సెకండ్ జనరేషన్ థార్ టైట్రానిక్స్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, హిల్ హోల్డ్, హిల్ డీసెంట్ కంట్రోల్‌ను కూడా జోడించింది. కొత్త మహీంద్రా థార్ ఏఎక్స్, ఎల్ ఎక్స్ సిరీస్ లో రెండు రంగుల్లో ఇది లభించనుందని తెలిపింది.

Next Story
Share it