Telugu Gateway
Latest News

అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం 13 దేశాలతో చర్చలు

అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం 13 దేశాలతో చర్చలు
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టకపోయినా భారత్ మాత్రం అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అమెరికాతోపాటు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఖతార్, మాల్దీవులకు ఎయిర్ బబుల్ కింద సర్వీసులు నడిపేందుకు ఒప్పందాలు చేసుకున్న భారత్ మరిన్ని దేశాలతో ఒప్పందాలకు రెడీ అవుతోంది. 13 దేశాలతో ఈమేరకు చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

భారత్ చర్చలు జరిపే దేశాల్లో ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే ఆయా దేశాలు అంగీకరిస్తేనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. కరోనా కేసుల సంఖ్య ఆధారంగానే ఆయా దేశాలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ లతో కూడా ఎయిర్ బబుల్ ఒప్పందాలు ఉంటాయన్నారు.

Next Story
Share it