Telugu Gateway
Latest News

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షలకు భారత్ అనుమతి

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షలకు భారత్ అనుమతి
X

కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చాలా ముందంజలో ఉంది. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఇప్పటికే రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని మూడవ దశకు కూడా చేరుకుంది. భారత్ లో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం చేసుకున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కు తాజాగా కీలక అనుమతి లభించింది. గత కొన్ని రోజులుగా ఈ వ్యాక్సిన్ ను భారత్ లో పరీక్షించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీరమ్ కోరుతోంది. అయితే ఇటీవలే దేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. లండన్‌లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్‌ లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు.

కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వాక్సిన్‌పై ముంబయ్ పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. సుమారు 5వేల మందితో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. వ్యాక్సిన్ పరీక్షలకు సంబంధించిన డేటా, ఫలితాలు, ప్రోటోకాల్ పై నిపుణుల కమిటీ సంతృప్తి చెందిందని, వారి అభిప్రాయం ఆధారంగా డీసీజీఐ భారతదేశంలో పరీక్షలకు అనుమతి ఇచ్చిందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ మేరకు వెంటనే టీకా ట్రయల్స్ ప్రారంభిస్తామని, త్వరలోనే పెద్ద పరిమాణంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని ఎస్‌ఐఐ సీఈవో అదార్ పూనవాలా ప్రకటించారు. ప్రస్తుతం ఈ టీకాపై యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ట్రయల్స్ కీలక దశలో ఉన్నాయి.

Next Story
Share it