Telugu Gateway
Latest News

రెండు ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం

రెండు ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం
X

షాకింగ్ న్యూస్. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం రెండు ముక్కలు అయింది. దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ విమానం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన విమానం అదుపు తప్పి ముందుకు వెళ్లింది. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ విమానం దుబాయ్ నుంచి వచ్చింది. శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్ , కో పైలట్ తోపాటు సహా మొత్తం 19 మంది మరణించారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 50 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఈ విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it