Telugu Gateway
Latest News

వీడియోలో చూసి..47 కోట్లతో ప్రైవేట్ ద్వీపం కొనుగోలు

వీడియోలో  చూసి..47 కోట్లతో ప్రైవేట్ ద్వీపం కొనుగోలు
X

ఎంత డబ్బున్న బడాబాబులు అయినా సరే ఖరీదైన విల్లా లేదా ఇళ్ళు కొనేటప్పుడు తాము కొనే ప్రాంతానికి ఓ సారి ఆ ప్రాంతం..పరిస్థితులు చూసి వస్తారు. ఆ తర్వాతే డీల్ ఓకే చేసుకుంటారు. ఎవరి రేంజ్ లో వాళ్లు కొనుగోలు చేస్తారు. కానీ ఇది మాత్రం అందుకు భిన్నం. ఏకంగా 47 కోట్ల రూపాయల విలువ చేసే ఓ ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు ఓ సంపన్నుడు. అది కూడా అక్కడ అడుగు పెట్టి చూడకుండానే. దీనికి కారణం కూడా కోవిడ్ 19 పరిస్థితులే.

అయితే ఓ వీడియో రూపంలో మొత్తం ఆ ప్రాంతాన్ని పరిశీలించి డీల్ ఓకే చేసుకున్నాడు. యూరప్ కు చెందిన ఓ అత్యంత సంపన్న వ్యక్తి ఐర్లాండ్ తీరప్రాంతంలో ఉన్న ఈ ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. ఐర్లాండ్ లోని రోరింగ్ వాటర్ బే ప్రాంతంలో ఉన్న ఈ 157 ఎకరాల హార్స్ ఐల్యాండ్ లో ఏడు ఇళ్ళు, హెలిప్యాడ్, జిమ్, టెన్నిస్ కోర్టు తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Next Story
Share it