మారుతికి పదిహేనేళ్ళలో తొలిసారి 249 కోట్ల నష్టం
BY Telugu Gateway29 July 2020 6:15 PM IST

X
Telugu Gateway29 July 2020 6:15 PM IST
మారుతి సుజుకి. దేశంలోనే నెంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ. ఈ సంస్థ గత పదిహేను సంవత్సరాల్లో తొలిసారి నష్టాలు మూటకట్టుకుంది. కోవిడ్ 19 ప్రభావం, లాక్ డౌన్లు మారుతిని నష్టాల బాట పట్టించాయి. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-జూన్ కాలంలో 249 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం ఏకంగా 1436 కోట్ల రూపాయలు ఉంది. కరోనా దెబ్బ ఆటోమొబైల్ రంగంపై పెద్ద ఎత్తున పడిన విషయం తెలిసిందే.
Next Story



