Telugu Gateway
Latest News

ఏడు కిలోమీటర్లకు ఎనిమిది వేల అంబులెన్స్ ఛార్జి

ఏడు కిలోమీటర్లకు ఎనిమిది వేల అంబులెన్స్ ఛార్జి
X

కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వైరస్ బారిన పడిన వారి బాధలు వర్ణనాతీతం. పొరపాటున ఎవరైనా ఈ వైరస్ కారణంగా చనిపోతే అంత్యక్రియల సమయంలోనూ అసాధారణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలకు దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది మాత్రం పీపీఈ కిట్లు ధరించి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే కరోనా పేషంట్ నుంచి ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏడు కిలోమీటర్లకు ఎనిమిది వేల రూపాయల ఛార్జ్ చేశారు. పూణేలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం సదరు అంబులెన్స్ డ్రైవర్ పై విపత్తు నిర్వహణ చట్టం, మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Next Story
Share it