Telugu Gateway
Latest News

జులై 31 వరకూ మెట్రో, స్కూళ్ళు..కాలేజీలు బంద్

జులై 31 వరకూ మెట్రో,  స్కూళ్ళు..కాలేజీలు బంద్
X

దేశంలోని కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను జులై 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దేశంలో జులై 31 వరకూ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల బంద్ కొనసాగనుంది. దీంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా నిషేధం అమల్లో ఉండనుంది.

సినిమా హాళ్ళు, మెట్రో రైలు, బార్స్, పార్కులు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ పై కూడా నిషేధం కొనసాగనుంది. ఈ మేరకు అన్ లాక్ 2 మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇందులో కొత్తగా ఎలాంటి మినహాయింపులు దక్కలేదనే చెప్పొచ్చు. ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే అంతరాష్ట్ర, రాష్ట్రంలో రవాణాలను అనుమతిస్తారు. దేశ వ్యాప్తంగా రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగించనున్నారు.

Next Story
Share it