Telugu Gateway
Latest News

పాక్ లో కూలిన విమానం

పాక్ లో కూలిన విమానం
X

లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానాశ్రయం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవాల్సి ఉండగా కుప్పకూలింది. కరాచీ విమానాశ్రయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జనావాసాల మధ్య విమానం కూలటంతో కలకలం రేగింది. కూలిపోయింది ఏ 320 విమానం. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమాన ప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. మోడల్ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Next Story
Share it