Telugu Gateway
Latest News

మే 25నుంచి దేశీయ విమాన సర్వీసులు

మే 25నుంచి దేశీయ విమాన సర్వీసులు
X

ఇక గగనయానం షురూ. ఇప్పటివరకూ విమానాశ్రయాల పార్కింగ్ ప్రదేశాలకే పరిమితం అయిన విమానాలు గాల్లోకి ఎగరనున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ పచ్చజెండా ఊపింది. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన ఎంతో మంది విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని వేయి కళ్లతో ఆశగా చూస్తున్నారు. వారి కోరిక తీరే సమయం వచ్చేసింది. మే 25 నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మే 25 నుంచి సర్వీసులు ప్రారంభించటానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఈ సేవలకు సంబంధించి అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ వోపీ) విడిగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. వాస్తవానికి కొన్ని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జూన్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభించాయని వార్తలు వెలువడిన తరుణంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ అందుకు భిన్నంగా మే 25 నుంచే సర్వీసులకు అనుమతి ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో త్వరలోనే ఆయా దేశాల్లో పరిస్థితులను మదింపు చేసి అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఏయే రూట్లలో సర్వీసులు అన్ని అంశాలపై మాత్రం త్వరలోనే స్పష్టత రానుంది.

Next Story
Share it