Telugu Gateway
Latest News

రైళ్ళు తిరిగేదెప్పుడు..విమానాలు ఎగిరేదెప్పుడు!

రైళ్ళు తిరిగేదెప్పుడు..విమానాలు ఎగిరేదెప్పుడు!
X

అవిగో బుకింగ్స్..ఇవిగో టిక్కెట్లు అంటూ లాక్ డౌన్ సమయంలో ఇప్పటికే పలు దఫాలు వార్తలు రావటం..ఆ తర్వాత వాటిని తూచ్ అనటం జరిగింది. తాజాగా ఎయిర్ ఇండియా మే 4 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని..టిక్కెట్ల బుకింగ్ ను కూడా ప్రారంభించామని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి స్పందిస్తూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎవరూ టిక్కెట్ల బుకింగ్ ను ప్రారంభించవద్దని ఆదేశించారు. దీంతో మే 4 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయనే ఆశలకు మరోసారి గండిపడినట్లు అయింది.

విమానాలే కాదు..రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ లు కూడా చేయవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రులు తెలిపారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఆ సర్వీసులు ఉంటాయి..ఈ సర్వీసులు ఉంటాయని చెప్పలేమని మంత్రులు తేల్చిచెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. రైళ్లు, విమానాల సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి ఇంకా ఎలాంటి తేదీలు ఖరారు చేయలేదని మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

Next Story
Share it