Telugu Gateway
Latest News

తల్లి అంత్యక్రియలకూ కొడుకు నో

తల్లి అంత్యక్రియలకూ కొడుకు నో
X

బంధాలు లేవు...బంధుత్వాలు లేవు. కరోనా దెబ్బకు అంతా కకావికలం. ఎవరికి వారు బతుకు జీవుడా...ఎలా అయితే కరోనా బారిన పడకుండా బతుకుతాం అనే మార్గాలు వెతుక్కుంటున్నారు. ప్రపంచం అంతా ఇప్పుడు అదే పరిస్థితి. కరోనా ఇప్పుడు ప్రపంచానికి ఎన్నో కొత్త కొత్త పాఠాలు చెబుతోంది. తల్లీ...కొడుకు..అక్కా, చెల్లి ఇలా సంబంధాలను కూడా అక్కరకు రాకుండా చేస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు విలయతాండవం చేస్తున్న విదేశాల్లో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో. తాజాగా భారత్ లో వెలుగులోకి వచ్చిన వార్త కన్నీళ్ళు పెట్టిస్తోంది. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది. ఓ ఆస్పత్రిలో కరోనా వైరస్ కారణంగా 69 సంవత్సరాల మహిళ మృతి చెందింది.

అయితే మరణించిన మహిళ బాడీని తీసుకుని...అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కొడుకు నిరాకరించాడని అధికారులు తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన రక్షణ వస్తువులు అందిస్తామని చెప్పినా కూడా ఆమె కొడుకు ముందుకు రాలేదన్నారు. చివరకు జిల్లా అధికార యంత్రాంగమే బాడీని తీసుకెళ్ళిందని ఆయన వెల్లడించారు. ఇలాంటి హృదయవిదారక సన్నివేశాలు విదేశాల్లో అయితే ఎన్నో జరుగుతున్నాయి.

Next Story
Share it