Telugu Gateway
Latest News

పాస్ లు అడిగినందుకు పోలీసు చేయి నరికారు

పాస్ లు అడిగినందుకు పోలీసు చేయి నరికారు
X

కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పోలీసులు రాత్రింబవళ్లు ప్రజలు ఎక్కడా కట్టుతప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. ఈ కరోనా సంక్షోభ సమయంలో అత్యంత ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్లు, పోలీసులే. ఈ తరుణంలో పంజాబ్ లోని పాటియాలా జిల్లాలో ఆదివారం నాడు దారుణం చోటుచేసుకుంది. ఆంక్షలు ఉన్న సమయంలో బయట తిరుగుతున్న ఓ ఐదుగురు సభ్యుల బృందాన్ని పోలీసులు ఆపి పాస్ లు చూపించాలని కోరారు.

దీంతో ఓ వ్యక్తి పోలీసు చేయి నరికేశాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు గాయాల పాలయ్యారు. ఓ వాహనంలో వెళుతున్న ఈ బృందాన్ని ఆపి పాస్ లు అడిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దూకుడుగా బారికేడ్లపైకి వచ్చి దాడి చేయటంతో పాటు కత్తితో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్ఐ) చేతిని నరికేశారని పాటియాలా సీనియర్ సూపరిండెంట్ పోలీస్ మన్ దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఈ దాడిలో చేయి తెగిన పోలీసు అధికారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story
Share it