Telugu Gateway
Latest News

ఏప్రిల్ 14న మార్కెట్లో వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్లు

ఏప్రిల్ 14న మార్కెట్లో వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్లు
X

వన్ ప్లస్ విభాగంలో అత్యంత ఖరీదైన ఫోన్ ఏప్రిల్ 14న మార్కెట్లోకి రాబోతోంది. వన్ ప్లస్ 8 ప్రొ, వన్ ప్లస్ 8 ఫోన్ల విడుదలకు రంగం సిద్ధం అయింది. ఈ ఫోన్ల విడుదలకు ముందే డిస్ ప్లే మేట్ ఈ ఫోన్లను పరిశీలించి వీటికి ఏ ప్లస్ గ్రేడ్ ను కేటాయించింది. వన్ ప్లస్ 8 ప్రొ డిస్ ప్లే పరంగా ఎన్నో రికార్డులను బద్దలుకొట్టినట్లు సమాచారం. వన్ ప్లస్ సీఈవో పీటీ లా ‘బిజినెస్ ఇన్ సైడర్’ తో మాట్లాడుతూ తమ కొత్త సిరీస్ ఫోన్ల ధరలు వెయ్యి డాలర్లు అంటే 76 వేల రూపాయలు మించి ఉండబోవనే సంకేతాలు ఇచ్చారు.

అసలు ధర విడుదల కొద్ది రోజుల ముందు వెల్లడికానుంది. దీంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 కంటే ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. వన్ ప్లస్ 8 సిరీస్ 5జీ నెట్ వర్క్ కు కూడా పనిచేసేలా రెడీ చేశారు. 5జీ టెక్నాలజీని తీసుకురావటంలో ఉన్న సవాళ్ళ కారణంగానే కొంత రేటు పెరుగుతోందని కంపెనీ సీఈవో వెల్లడించారు.

Next Story
Share it