Telugu Gateway
Latest News

మే 4 నుంచి ఇండిగో సర్వీసులు

మే 4 నుంచి ఇండిగో సర్వీసులు
X

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఇండిగో’ మే 4నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తామని ఇండిగో సీఈవో రానో జోయ్ దత్త ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనాపై ప్రభుత్వం పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. వచ్చే రోజుల్లో తమ నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచుకుంటామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా దేశీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

Next Story
Share it